Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముంబయి: మద్యం మత్తులో ప్రియురాలితో ప్రియుడు శృంగారం కోసం వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో అస్వస్థతకు గురై అతడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలు దగ్గరకు మద్యం తీసుకొని వెళ్లాడు. మద్యం తాగిన అనంతరం ప్రియురాలితో శృంగారం కోసం రెండు వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. దీంతో వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. మెదడు రక్తం గడ్డ కట్టడంతో అతడు ఆక్సిజన్ అందక అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.