Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 308 పాయింట్ల నష్టంతో 59,915 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 17,626 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.22 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.