Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యే అని రాష్ట్ర గిరిజన, స్త్రీ ఉ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. కేంద్ర విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడం.. మరింతగా పోరాడుతామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు బీజేపీ పతనానికి నాంది అని మంత్రి పేర్కొన్నారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆమె మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమవడంతో బీజేపీకి భయం పట్టుకుందిం. మహిళలంతా తిరుగుబాటు చేస్తారనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఈడీ బోడిలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేషాలు వేసినా భయపడేదే లేదు అని సత్యవతి రాథోడ్ తేల్చిచెప్పారు.