Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు ఆఖరి అరగంట వరకు అదే బాటలో పయనించాయి. చివర్లో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ సూచీలు మాత్రం సానుకూలంగా ముగిశాయి.
ఉదయం సెన్సెక్స్ 59,916.10 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,402.85- 59,844.82 మధ్య కదలాడింది. చివరకు 123.63 పాయింట్ల లాభంతో 60,348.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,665.75 దగ్గర ప్రారంభమై 17,766.50- 17,602.25 మధ్య ట్రేడైంది. చివరకు 42.95 పాయింట్లు లాభపడి 17,754.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.99 దగ్గర నిలిచింది.