Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఏం జరిగిందన్న అంశంపై జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, ఉన్నతాధికారులతో రెండున్నర గంటల పాటు సమీక్షించారు.
ఈ తరుణంలో సీఎంహెచ్వో, స్టాటస్టికల్ అధికారులపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండా మంజూరైన 21వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు గుర్తించామన్నారు. రద్దు చేసిన జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల దరఖాస్తు దారులందరికీ నోటీసులు ఇస్తామన్నారు. వీరందరికీ త్వరలోనే మొబైల్ ద్వారా సమాచారం అందిస్తాం. వారు తమ దరఖాస్తులను మళ్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 15 మీసేవా కేంద్రాల్లో ఈవిధమైన సర్టిఫికెట్లు అప్లోడ్ అయినట్టు గుర్తించాం. ఈ వ్యవహారంపై మీసేవా విభాగంతో పాటు పోలీసు శాఖకు ఫిర్యాదు చేస్తాం అన్నారు.