Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని విజయ్ పార్క్లో ని ఈ భవనం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టింది. సకాలంలో భవంతిలోని వారిని ఖాళీ చేయడంతో ఎవరూ ఈ ఘటనలో మృతి చెందలేదని అధికారులు తెలిపారు.
సాయిబాబా ఆలయంలో సమీపంలోని విజయ్ పార్క్ ఏరియాలో భవంతి కుప్పకూలినట్టు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చినట్టు డీఎస్ఎశ్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం భవంతి క్రింది ఫ్లోర్లో ఒక వాచ్ షాపు, మొదటి ఫ్లోర్లో ఒక మొబైల్ షాపు, రెండో అంతస్తులో ఒక కుటుంబం ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి ఇంటిలోని టైల్స్ రాలిపడుతుండటం, వాల్ సీలింగ్ కూలడంతో భవంతినిలోని అందర్నీ వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది.