Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దస్తురాబాద్
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిందని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇవ్వడం చాలా బాధకరమైన విషయమని, ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణోద్యమంలో జాగృతి తరుఫున ఎమ్మెల్సీ కవిత మహిళలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలంగాణ ప్రజలు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.