Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్నూలు
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే దారుణహత్య జరిగింది. గ్రామంలో జాతర జరుగుతుండగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినా, అందరూ చూస్తుండగానే అల్లుడు సూర్యప్రకాశ్(23)ను మామ లింగమయ్య కత్తులతో దాడి చేసి హతమార్చాడు. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో జాతరలో పాల్గొన్న అల్లుడిని హత్య చేయాలని లింగమయ్య భావించాడు. పథకం ప్రకారం కత్తులు సిద్ధం చేసుకుని దాడి చేశాడు. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన సూర్యప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.