Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మద్యం కేసు లో ఈడీ నోటీసులు, విచారణపై ఆమె స్పందించే అవకాశముంది. ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9, 10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని 11న హాజరవుతానని బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా 10న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకు రావాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నారు.