Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయ్పూర్
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకునాయి. ఈ ఎన్కౌంటర్లో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సక్లార్ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
ఈ తరుణంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో పోలీసుల కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు మావోయిస్టులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో పెద్దసంఖ్యలో బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు.