Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
ఆస్ట్రేలియాతో నరేంద్ర మోడి స్టేడియంలో మొదలైన నాలుగో, చివరి టెస్టులో భారత బౌలర్లు నెమ్మదిగా రేసులోకి వస్తున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా జోరుకు బ్రేకులు వేస్తున్నారు. 16వ ఓవర్లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. ఇదే తరుణంలో 23వ ఓవర్లో మమ్మద్ షమీ మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ డీలా పడింది. ప్రస్తుతం ఆసీస్ 75/2 స్కోరుతో ఆడుతుండగా ఉస్మాన్ ఖవాజా (27)కు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (2) క్రీజులో ఉన్నాడు.