Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాద్రి కొత్తగూడెం
చంచుపల్లి మండలం రాంపురంలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల పాప మొక్కజొన్న గింజలు తింటూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఊపిరితిత్తుల్లోకి గింజలు చేరడంతో శ్వాస ఆడక విలవిల్లాడింది. కాసేపటికే కన్నుమూసింది.
చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న బొల్లికొండ వెంకట కృష్ణ, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బిందుశ్రీ బుధవారం ఇంట్లో మొక్కజొన్నగింజలు తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గురావడంతో మూడుసార్లు వాంతులు చేసుకుంది. ఈ క్రమంలోనే మొక్కజొన్న గింజలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లాయి. దీంతో శ్వాస ఆడక బిందుశ్రీ ఇబ్బంది పడింది. వెంటనే పాపను కొత్తగూడెంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో పాప ఊపిరితిత్తుల్లో మొక్కజొన్న గింజలను గుర్తించిన వైద్యులు పాపకు వెంటనే బ్రాంకోస్కోప్ చేయాలని తెలిపారు. ఆ సదుపాయం ఖమ్మంలో లేకపోవడంతో పాపను వరంగల్ తరలించాలని సూచించారు. ఈ క్రమంలో అందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బిందుశ్రీ ప్రాణాలు విడిచింది.