Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర్ప్రదేశ్
ప్రయాగ్రాజ్ సమీపంలో దయాల్పుర్ రైల్వే స్టేషన్ 1954లో నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో 2006లో దీన్ని మూసేశారు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్పుర్ ప్రజలు కొన్నేళ్లపాటు పోరాటం చేశారు. వారి కృషి ఫలించి 2022 జనవరిలో అధికారులు స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి.
ఆ తర్వాత మళ్లీ అమ్మకాలు పడిపోయాయి. ఇన్నేళ్లు కష్టపడి తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్ మళ్లీ మూతపడితే ఎలా అన్న సందేహం గ్రామస్థుల్లో మొదలైంది. ఆదాయం తగ్గి స్టేషన్ మూతపడకుండా ఉండేందుకు గ్రామస్థులు ప్రయాణాలు చేయకపోయినా టికెట్లు కొంటున్నారు. 2022 డిసెంబర్ వరకు నెలకు సుమారు 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీన్ని గమనించిన గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారు. స్టేషన్ ఆదాయం తగ్గిపోయినప్పుడల్లా తాము టికెట్లు కొంటామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే రైలు ఎక్కకపోయినా టికెట్ కొంటూ వాళ్ళ స్టేషన్ను కాపాడుకుంటున్నారు.