Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. భారత గడ్డపై కోహ్లికి ఇది 50వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా కూడా నిలిచాడు.
భారత జట్టు తమ గడ్డపై 50 టెస్టు మ్యాచ్లు ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు అలాంటి ఘనత సాధించారు. అందులో గ్రేట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ చేరారు. భారత్లో 94 టెస్టు మ్యాచ్లు ఆడిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇందులో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత భారత్లో 70 టెస్టు మ్యాచ్లు ఆడిన రాహుల్ ద్రవిడ్ పేరు ఉంది. ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, అశ్విన్లు కూడా ఈ జాబితాలో చేరారు.