Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్తో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్షకు భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతి రద్దు చేస్తున్నట్లు కవితకు పోలీసులు తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతుండగానే సమాచారం అందించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా రద్దు చేస్తారని కవిత ప్రశ్నించారు. తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.