Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈ క్రమంలో రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్లో ఉందని దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
ధరణిలో సగం ఆకాశంలో సగం అవకాశంలోనూ సగం కావాలంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా అది ఇంకా చట్టం కాలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో బీజేపీ ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. మహిళా రిజర్వేషన్ సాధించేవరకు విశ్రమించేది లేదు అని కవిత అన్నారు.