Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూర్
గురువారం రాత్రి మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ఓ కండక్టర్ సజీవ దహనమయ్యారు. మృతుడిని ముత్తయ్య స్వామిగా గుర్తించారు. పోలీసులు వివరాల ప్రకారం డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్స్టాండ్లోని డీ గ్రూప్ స్టాప్లో పార్క్ చేసి వెళ్లారు. బస్ స్టేషన్లో విశ్రాంతి మందిరంలో డ్రైవర్ నిద్రించగా కండక్టర్ ముత్తయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయారు. ఈ తరుణంలో రాత్రివేళ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కండక్టర్ బలైపోయారు. ముత్తయ్యకు 80 శాతం మేర కాలిన గాయాలయ్యాయని స్థానిక డీసీపీ మీడియాకు తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన విషయన్ని తొలుత డ్రైవర్ గుర్తించారని తెలిపారు.