Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
హోలీ పండుగ రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జపాన్కు చెందిన ఓ యువతిని చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు. ఆమెను గట్టిగా పట్టుకుని రంగులు పూసి, తలపై గుడ్డు కొట్టారు.
వారిని వదిలించుకుందామని ఆమె ప్రయత్నించినప్పటికీ ఒకరి తర్వాత మరొకరు హోలీ, హోలీ అంటూ అరుస్తూ బలవంతంగా ఆమెకు రంగులు పూశారు. ఎలాగోలా వారి చేతుల నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆమెకు మరో యువకుడు అడ్డొచ్చాడు. దీంతో అతని చెంప ఛెళ్లుమనించింది. అయినా అతడు ఆమె మొహంపై రంగుపూశాడు. చివరికి అక్కడినుంచి ఆమె బయటపడింది. ఇదంతా తమ ఫోన్లలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు