Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఓపెనర్లు రోహిత్ శర్మ (17), శుభ్మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 444 పరుగులు వెనకబడి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 480 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐదో వికెట్కు వీళ్లు 208 పరుగులు చేయడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది.