Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అరెస్టు చేస్తారట చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తే లేదు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారు. నోటీసుల పేరుతో పార్టీ నేతలందర్నీ వేధిస్తున్నారు. కేంద్రంపై మా పోరాటం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.