Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కుమార్తె
నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డ్యాకుమెంటరీపై ఈ నెల 7న వాషింగ్టన్లో నేషనల్ ప్రెస్ క్లబ్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన ప్యానెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'జైలు పాలు చేస్తారని లేదా చంపుతారనే భయం లేకుండా అమెరికా జర్నలిస్టులు స్వేచ్ఛగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. అమెరికా ప్రభుత్వానికి కూడా ఇదే వర్తిస్తుంది. మోడీకి అమెరికా అధ్యక్షుడు ఎందుకు స్వాగతం పలకాలి?' అని ఆకాశీ అన్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ ఏడాదిలో మోడీ బైడెన్తో వైట్ హౌస్లో చర్చలు జరిపే అవకాశం ఉన్నది. గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉన్నదని నిరూపించడానికి తన తండ్రి ఒంటరి పోరాటం చేస్తున్నారని, అకారణంగా ఆయనను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆకాశీ ఆవేదన వ్యక్తం చేశారు. 'భారత న్యాయవ్యవస్థ పని చేయడం లేదు. దాన్ని పూర్తిగా కూల్చేశారు. మోడీ పాలనకు ప్రయోజనం కలిగించేలా దాన్ని మార్చేశారు' అని ఆరోపించారు.