Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకల్లో జపాన్కు చెందిన యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా రంగులు పూయడం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అలాగే ఆ టూరిస్టు భారత్ వీడి, బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ యువతి దిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఉంది.
దేశమంతా హోలీ ఉత్సవాలు చేసుకుంటున్న తరుణంలో కొందరు యువకులు ఈ జపాన్ టూరిస్టును గట్టిగా పట్టుకొని, ఆమెను చుట్టుముట్టి రంగులు పూశారు. తలపై కోడిగుడ్లు కొట్టారు. వారిని విడిపించుకొని దూరంగా వెళ్తున్న ఆమెను మరో యువకుడు పట్టుకోబోగా అతడి చెంప పగులగొట్టింది. దీంతో వారు ఆమెతో ప్రవర్తించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఆ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే వారిపై సదరు యువతి ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. దీని తర్వాత బంగ్లాదేశ్ వెళ్లిపోయిన ఆమె ట్విటర్గా వేదికగా స్పందించింది. నేను క్షేమంగానే ఉన్నాను. ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అని ఆ యువతి ట్వీట్ చేసింది.