Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 31తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. హైదరాబాద్లో 48 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్లకు చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: sbi.co.in