Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చిల 16 నుంచి భట్టి పాదయాత్ర మొదలు కానుంది. జూన్ 15 వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా బజార్ హత్నూర మండలం పిర్పి నుంచి ప్రారంభమై ఖమ్మం జిల్లాలో ముగియనుంది. మొత్తం 91 రోజులు, 39 నియోజకవర్గాలు, 1,365 కిలోమీటర్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయనున్నారు.