Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపూర్
బీకనీర్ రాజకుటుంబ సభ్యురాలు, రాజమాత సుశీలా కుమారి (94)కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మృతిమెందారు. ఆదివారం పూర్తి రాజ లాంఛనాలతో సుశీలా కుమారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటి వరకు ప్రజల సందర్శనార్థం సుశీలా కుమారి భౌతిక కాయాన్ని బికనీర్లోని జునాగఢ్ కోటలో ఉంచనున్నట్లు వెల్లడించారు.