Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
ప్రస్తుతం బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ కొనసాగుతున్న పశ్చిమ ద్రోణి ఈ నెల 15వ తేదీ నాటికి తూర్పు వైపుగా పయనించనున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పడమర దిశ నుంచి వచ్చే గాలులు, బంగాళాఖాతం మీదుగా వీచే తూర్పుగాలుల కలయికతో ఈనెల 15 నుంచి కోస్తా, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ తదితర ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ ద్రోణి మరింత బలపడే అవకాశం ఉన్నందున ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.