Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 12న జరగాల్సిన టీపీబీవో పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని టీఎస్పీఎస్సీ తెలిపింది. హ్యాకింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.