Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్కు మూడో విజయం. గుజరాత్తో జరిగిన ఏకపక్ష మ్యాచ్లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (76; 28 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లు) వీర విహారం చేసింది. షెఫాలీ 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ మెగ్ లానింగ్ (21) పరుగులు చేసింది.