Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆకాంక్షించారు. స్వల్ప అస్వస్థతతో సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న గవర్నర్... సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన సీఎం కేసీఆర్కు.. ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వైద్యనిపుణులు ఎండోస్కోపి, సీటీ స్కాన్ చేశారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించారు. సీఎంకు మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. సుమారు 7గంటల పాటు సీఎం ఆస్పత్రిలోనే ఉన్నారు. రాత్రి ఏడు గంటలకు ఆస్పత్రి నుంచి సీఎం ప్రగతి భవన్కు వెళ్లిపోయారు.