Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబైలోని ఓగేశ్వరిలోని ఓషివారా ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సమాచారం అయితే లేదు. కానీ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫర్నీచర్ గోడౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకవేళ ఎవరైనా గాయపడి ఉంటే చికిత్స అందించేందుకు అంబులెన్స్లు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి.