Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : వ్యాపారవేత్త అదానీ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంతాల్లో నిరసన ప్రదర్శనలు (Congress protests) చేపట్టింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్తోపాటు చండీగఢ్లో భారీ ర్యాలీలు నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అస్సాం, చండీగఢ్లో చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. దీంతో రాజ్భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం అదానీ అంశాన్ని లేవనెత్తింది. అలాగే దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలో నిరసన చేపట్టింది.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశంలో చట్టబద్ధమైన పాలన లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు.