Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు బ్యాటర్లు చెలరేగారు. దాంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. ఎలీసా పెర్రీ (67) హఫ్ సెంచరీతో ఆర్సీబీని ఆదుకుంది. ఆమెకు రీచా ఘోష్ (37) సహకారం అందించింది. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్స్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాలుగో వికెట్కు 74 రన్స్ జోడించారు. ఎలీసా, రీచా 14వ ఓవర్ నుంచి ఎడాపెడా బౌండరీలు బాదారు. దాంతో, ఆర్సీబీ 160 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, 137 పరుగుల వద్ద రీచా నాలుగో వికెట్గా వెనుదిరిగింది. దాంతో, స్కోర్బోర్డు వేగం మందగించింది. పెర్రీ, రీచా ధాటికి ఆఖరి ఆరు ఓవర్లలో 82 పరుగులు వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు, తారా నోరిస్ ఒక వికెట్ తీశారు.