Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఈ నెల 22న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.