Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వివిధ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు పసిడి వైపు మళ్లుతున్నారు. దీంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. మార్చి 13న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.970 పెరిగి రూ. 56550కి చేరింది. ఇక విదేశీ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1875 డాలర్ల వద్ద, వెండి 20.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అధికారి సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికాలో బ్యాంకింగ్ రంగం కుదుపులకు లోనవుతుండటంతో మదుపర్ల చూపు మళ్లీ పసిడి వైపు మళ్లింది. రోజుల వ్యవధిలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు పతనమయ్యాయి. దీంతో అమెరికా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. దీని ప్రభావం అనేక దేశాల్లో కనిపించింది. మరోవైపు.. అమెరికా డాలర్ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కూబి మదుపర్ల సెంటీమెంట్పై దెబ్బకొట్టాయి. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఐదు వారాల గరిష్ఠానికి చేరాయి. మార్కెట్ ఒడిదుడుకులపాలైన ప్రతిసారీ మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు నిధులు మళ్లిస్తారని, ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదలకు ఇదే కారణమని ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోటిటీస్ రీసెర్చ్ అధికారి నవనీత్ దమానీ తెలిపారు.