Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఎగ్జామ్ పేపర్ లీక్ను నిరసిస్తూ బీజేపీ శ్రేణుల భారీ ఆందోళనకు దిగాయి. టీఎస్పీఎస్ఈ బోర్డును ధ్వంసం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. సిట్టింగ్ జడ్జితో విచారణకు బీజేవైఎం డిమాండ్ చేసింది. మరోవైపు యూత్ కాంగ్రెస్ సైతం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. కార్యాలయం లోపలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్కు తరలించారు.