Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజే ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. 48గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ప్రశ్నపత్రం లీకేజీని తీవ్రంగా పరిగిణించిన గవర్నర్ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు ప్రతిపాదించాలని సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే 9మంది నిందితులను గుర్తించిన బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 9మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. మరో వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.