Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత లోపలికి అనుమతించరు. ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం మొత్తం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 61 సెల్ఫ్ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్య లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్లను నియమించారు.