Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో 58,314 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 129.30 పాయింట్ల లాభంతో 17,172 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.14 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐఎన్, సన్ ఫార్మా నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.