Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం జిల్లాలోని తంబళ్లపలె నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి 43వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా సెల్ఫీవిత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత చురుకుగా పాల్గొంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి గుట్టపాలెం విడిది కేంద్రం వద్దకు వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి వారితో లోకేష్ ఫోటోలు దిగారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి యువనేత సెల్ఫీ ఇస్తున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.