Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఇవాళ మాజీ రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. వీల్ చైర్లో ఆయన కోర్టు రూమ్కు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె, ఎంపీ మీసా భారతి కూడా కోర్టుకు హాజరయ్యారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు బదులుగా తక్కువ ధరకే భూముల్ని కొన్నట్లు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో లాలూ విచారణకు హాజరవుతున్నారు.