Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్కు కాకుండా మరో ప్లేస్కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అక్కడ ఎగ్జామ్ సెంటర్ లేకపోవడంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. ఈ క్రమంలో వినయ్ 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. అయితే నిమిషం నిబంధనంగా కఠినంగా అమలు చేస్తుండటంతో వినయ్ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో ఇంటికి వెనుదిరిగాడు.