Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ముంబయి
1980ల్లో దూరదర్శన్ హిట్ షోలో పాపులర్ క్యారెక్టర్ ఖోప్దిగా పేరొందిన సమీర్ కక్కర్ (71) మరణించారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగు దశాబ్ధాలుగా స్టేజ్, ఫిల్మ్, టీవీ నటుడిగా సమీర్ కక్కర్ రాణిస్తున్నారు. ఆయన చాలా కాలంగా నటనకు దూరంగా 1996 నుంచి అమెరికాలో స్ధిరపడగా ఇటీవల దేశానికి తిరిగి వచ్చారు.
జై హో మూవీలో నటించగా సంజీవని అనే టీవీ షోలోనూ కనిపించారు. గుజరాతీ నాటకాలతో పేరొందిన సమీర్ కక్కర్ టీవీ షో నుక్కడ్తో వెలుగులోకి వచ్చారు. ఈ షోతో ఆయన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్ధిరపడ్డారు. సర్కస్, నయా నుక్కడ్, శ్రీమాన్ శ్రీమతి, మణిరంజన్, అదాలత్ వంటి టీవీ షోలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆయన హసీ తో ఫసీ, పటేల్ కో పంజాబీ షాదీ, పుష్కక్, పరింద, షహెన్షా వంటి సినిమాల్లోనూ సమీర్ కక్కర్ కనిపించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఫర్జి, జీ5 సన్ఫ్లవర్, సుధీర్ మిశ్రా సీరియస్ మెన్ షోల్లోనూ ఆయన నటించారు.