Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మహిళా బిల్లుపై పార్లమెంటులో ఒత్తిడి తెస్తామని చెప్పారు. బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పారు. ఈడీ తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు.