Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భద్రాద్రి రామయ్య భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరిన వారికి ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. అయితే, ఇందుకోసం రూ. 116 చెల్లించాల్సి ఉంటుంది. కావాల్సి వారు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఆ మొత్తం చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని బస్ భవన్లో నిన్న కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. అంతేకాదు, రూ. 116 చెల్లించి బుకింగ్ను ప్రారంభించారు. గతేడాది కూడా 89 వేల మందికి స్వామి వారి కల్యాణ తలంబ్రాలను అందించినట్టు తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాన్ని 91776 83134, 73829 24900, 91546 80020 నంబర్లలో సంప్రదించాలని కోరారు.