Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ఆపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023- 24 వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం నున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచనున్నారు.