Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్కు అరుదైన గౌరవం దక్కింది. 2023 సంవత్సరానికి గాను గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చి జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంత దాస్కు ఈ పురస్కారన్ని ప్రదానం చేసింది. కష్టకాలంలో ఆర్బీఐ గవర్నర్గా ఆయన అందించిన సేవలకు గానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు సెంట్రల్ బ్యాంకింగ్ తెలిపింది.
కరోనా సమయం, ఉక్రెయిన్- రష్యా యుద్దం కారణంగా నెలకొన్న ద్రవ్యల్బణం ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆర్బీఐ గవర్నర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడింది. శక్తికాంత దాస్ నాయకత్వంలోనే కఠిన సంస్కరణలు తీసుకురావడంతో పాటు, వినూత్న పేమెంట్ వ్యవస్థలు భారత్లో పరిచయం అయ్యాయని తెలిపింది. అయితే గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న రెండో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ నిలిచారు. గతంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్కు 2015లో ఈ పురస్కారం అందుకున్నారు.