Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు. డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా వైజాగ్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభిచారు.
ఆ తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘసేవకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే తన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సాహిత్యంపై కూడా ఆనందరావుకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు. 2017లో మిథునం చిత్రానికి నంది అవార్డు కూడా వరించింది.