Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజామాబాద్ : జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మూడు కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సర్పంచ్ మిస్బా, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో అటవీశాఖ సెక్షన్ అధికారి గణేశ్ అక్కడికి చేరుకొని కొండ చిలువలను గుర్తించారు. మూడు కొండ చిలువలు కనిపించాయని స్థానికులు తెలుపగా రెండింటిని అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వాటిని అడవిలో విడిచి పెడతామని అటవీశాఖ సెక్షన్ అధికారి వెల్లడించారు.