Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ‘‘మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్. పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబంధం ఉంది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది సీబీఐ దర్యాప్తు ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.