Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
స్వప్నలోక్ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని.. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా దురదృష్టకరమని.. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందని వివరించారు. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారని తెలిసిందని.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని వెల్లడించారు.